- ఎన్నికలు 2024
- రాబోయే ఎన్నికలు
- ఎన్నికల వార్తలు
- లోక్ సభ ఎన్నికలు
ఇందిరా గాంధీ
దేశాన్ని నడిపించిన చరిష్మా గల, వివాదస్పద రాజకీయ నాయకులలో ఇందిరా గాంధీ అగ్రగణ్యులు. 1966-1977 వరకు మళ్ళీ 1980 లో నుంచి 1984 లో ఆమె కన్నుమూసేంత వరకు దేశ ప్రధాన మంత్రిగా పని చేశారు.
- ఆంధ్రప్రదేశ్
- అరుణాచల్ ప్రదేశ్
- ఛత్తీస్గఢ్
- హిమాచల్ ప్రదేశ్
- జమ్ము & కాశ్మీర్
- మధ్యప్రదేశ్
- పాండిచ్చేరి
- ఉత్తరప్రదేశ్
- పశ్చిమబెంగాల్
- Aam Aadmi Party
- All India Anna Dravida Munnetra Kazhagam
- All India Majlis-e-ittehadul Muslimeen
- All India Majlis-e-ittehadul Muslimoon
- All India Trinamool Congress
- Apna Dal (soneylal)
- Bahujan Samaj Party
- Bharatiya Janta Party
- Bhartiya Jagaran Party
- Biju Janata Dal
- Communist Party Of India (marxist)
- Dravida Munetra Kazhagam
- Independent
- Indian National Congress
- Indian National Lok Dal
- Jammu & Kashmir National Conference
- Jammu & Kashmir Peoples Democratic Party
- Janata Dal (samajwadi)
- Janata Dal (united)
- Jharkhand Mukti Morcha
- Lok Jan Shakti Party
- Makkal Needhi Maiam
- Mizo National Front
- Nationalist Congress Party
- Nationalist Democratic Progressive Party
- Pattali Makkal Katchi
- Rashtriya Janata Dal
- Rashtriya Lok Dal
- Rashtriya Lok Samta Party
- Samajwadi Party
- Shiromani Akali Dal
- Sikkim Democratic Front
- Telangana Rashtra Samithi
- Yuvajana Sramika Rythu Congress Party
Quick Links
ఇందిరా గాంధీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర), ఇందిరా గాంధీ వ్యక్తిగత జీవితం, ఇందిరా గాంధీ రాజకీయ జీవితం, ఇందిరా గాంధీ సాధించిన విజయాలు, ఇందిరా గాంధీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు.
- ఇందిరా గాంధీ ఆస్తులు
దేశాన్ని నడిపించిన చరిష్మా గల, వివాదస్పద రాజకీయ నాయకులలో ఇందిరా గాంధీ అగ్రగణ్యులు. 1966-1977 వరకు మళ్ళీ 1980 లో నుంచి 1984 లో ఆమె కన్నుమూసేంత వరకు దేశ ప్రధాన మంత్రిగా పని చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తెగా ఆమె బాల్యం ఒంటరితనంతో విషాదభరితంగా సాగింది. చిన్న వయసులోనే ఆమె తల్లిని కోల్పోయారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో నెహ్రు ఆమెను తరచుగా గదిలో ఉంచేవారు. ఆమె విద్యాభ్యాసం వివిధ బోర్డింగ్ స్కూళ్లలో సాగింది. 1942 లో ఫిరోజ్ గాంధీని పెళ్లాడారు. తన తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. నెహ్రు అనంతరం పార్టీలో ఎదిగి, లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అయ్యారు. పార్టీ మద్దతుతో 1996 లో ఆమె దేశ ప్రధాని అయ్యారు. పార్టీలో ఆమె సర్దుకుపోయే ధోరణిలో ఉంటారని పార్టీ సభ్యులు భావించినప్పటికీ, వాళ్ళ అంచనాలకు విరుద్దంగా, వారు వ్యతిరేకించినప్పటికీ బ్యాంకులను జాతీయం చేశారు. పార్టీలోని పలువురు ఆమెను పార్టీ నాయకురాలిగా తోసిపుచ్చినప్పటికీ, వాళ్లపై ప్రతీసారి పైచేయి సాధించి అధికారంలోకి వచ్చారు. ప్రధానిగా ఆమె హయాంలో అవినీతి ఆరోపణలు మరియు నిరంకుశ పాలనతో అత్యవసర పరిస్థితి విధించడంతో ఆమె సంకీర్ణ కూటమికి అధికారం అప్పగించాల్సి వచ్చింది. అయితే ప్రతికూల భావనలను బద్ధలు కొడుతూ 1980 లో ఆమె మరోసారి అధికారంలోకి వచ్చారు. అయితే ప్రధానిగా ఆమె తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఆమె మరణానికి కారణమయ్యాయి. ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట వందల మంది సిక్కులను చంపటం, వేలాది శరణార్థులకు వోట్ హక్కులు కల్పించటం, నెల్లి మారణఖండ వంటి ఘటనలు ఆమె హయాంలో చోటు చేసుకోవడంతో 1984 లో ఆమె దారుణ హత్యకు గురయ్యారు.
పూర్తి పేరు | ఇందిరా గాంధీ |
పుట్టిన తేదీ | 19 Nov 1919 |
మరణం యొక్క తేదీ | 31 Oct 1984 (వయస్సు 64) |
పుట్టిన ప్రాంతం | అలాహాబాద్, యునైటెడ్ ప్రావిన్సెస్ అఫ్ ఆగ్రా అండ్ ఔద్, బ్రిటిష్ ఇండియా |
పార్టీ పేరు | Indian National Congress |
విద్య | |
వృత్తి | రాజకీయ, సామాజిక కార్యకర్త |
తండ్రి పేరు | జవహర్ లాల్ నెహ్రూ |
తల్లి పేరు | కమలా నెహ్రూ |
మతం | హిందూ |
ఇందిరా గాంధీ నికర ఆస్తులు
- 1980 జనవరి నుంచి కేంద్ర రక్షణ శాఖా మంత్రిగానూ సేవలందించారు.
- మార్చ్ 1971 నుంచి కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రిగా పని చేశారు.
- జూన్ 1970 నుంచి నవంబర్ 1973 వరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖా మంత్రిగా పని చేశారు.
- జులై 16, 1969 నుంచి జూన్ 26, 1970 వరకు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రిగానూ సేవలందించారు.
- ప్రధాని పదవితో పాటు 1967 సెప్టెంబర్ నుంచి మార్చ్ , 1977 వరకు ; మళ్ళీ జూన్, 1972- మార్చ్ 1977 వరకు ; 1980 జనవరి నుంచి కేంద్ర అణు విద్యుత్, అంతరిక్ష మంత్రిగా పని చేశారు. సెప్టెంబర్ 5, 1967 నుంచి ఫిబ్రవరి 14, 1969 వరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా సేవలందించారు.
- 1996 జనవరి నుంచి మార్చ్ 1977 వరకు మళ్లి జనవరి 14, 1980 నుంచి 1984 వరకు ప్రధానిగా పని చేశారు. దీంతోపాటు 1966-77 మధ్య ప్రణాళిక సంఘం చైర్మన్ గా సేవలందించారు.
- రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై , కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అయ్యారు.
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యురాలిగా నియమితులయ్యారు.
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/ , https://sansad.in/ls , https://sansad.in/rs , https://pib.gov.in/ , https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.
భారత్లో పేరుగాంచిన నాయకులు
- యోగి ఆదిత్యనాథ్
- నిర్మలా సీతారామన్
- నితీష్ కుమార్
- నరేంద్ర మోడీ
- నారా చంద్రబాబు నాయుడు
- నవీన్ పట్నాయక్
- సోనియా గాంధీ
- సుబ్రమణియణ్ స్వామి
- భూపేష్ బాఘేల్
- గులాం నబీ ఆజాద్
- అసదుద్దీన్ ఓవైసీ
- అఖిలేశ్ యాదవ్
- అరవింద్ కేజ్రీవాల్
- శివరాజ్ సింగ్ చౌహాన్
- మెహబూబా ముఫ్తీ
- మనోహర్ లాల్ ఖట్టర్
- మమతా బెనర్జీ
- ఉద్ధవ్ థాకరే
- కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
- రాహుల్ గాంధీ
- రాజ్ నాథ్ సింగ్
- బీ ఎస్ యడ్యూరప్ప
- దేవేంద్ర ఫడ్నవీస్
- తేజస్వీ ప్రసాద్ యాదవ్
- హెచ్ డీ కుమార స్వామి
- పినరయి విజయన్
- ప్రియాంక గాంధీ వాద్రా
- ఎం కే స్టాలిన్
- వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- Don't Block
- Block for 8 hours
- Block for 12 hours
- Block for 24 hours
- Dont send alerts during 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am to 1 am 2 am 3 am 4 am 5 am 6 am 7 am 8 am 9 am 10 am 11 am 12 pm 1 pm 2 pm 3 pm 4 pm 5 pm 6 pm 7 pm 8 pm 9 pm 10 pm 11 pm 12 am
- Don't block
- Click on the Menu icon of the browser, it opens up a list of options.
- Click on the “Options ”, it opens up the settings page,
- Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
- Scroll down the page to the “Permission” section .
- Here click on the “Settings” tab of the Notification option.
- A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
- Once the changes is done, click on the “Save Changes” option to save the changes.
- TN Navbharat
telugu news
భారత ఉక్కు మహిళ ఇందిరా గాంధీ.. ఆమె రూటే సెపరేట్..
Updated Oct 27, 2023, 22:22 IST
Indira Gandhi
కేశంపేట పోలీసు స్టేషన్కు హరీష్ రావు తరలింపు.. స్టేషన్ బయట తీవ్ర ఉద్రిక్తత..
ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్: సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల భేటీ
పవన్ కల్యాణ్కు సెంటిమెంట్ భయం?: విజయవాడ క్యాంపు కార్యాలయానికి ఓ దండం..ఇంటినే క్యాంప్ ఆఫీసుగా మార్చుకోనున్న జనసేనాని
తెలంగాణ అభిమానులు 10,000 మంది తరలిరండి..: హరీష్ రావు పిలుపు
చంద్రుడు రానీయడు..పవనుడు చేరదీయడు: బాలినేని పయనమెటు? మార్గం ఇదేనా...?
ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీకి రూ.100కోట్లు: వ్యాపార వేత్తలకు సీఎం చంద్రబాబు తీపికబురు
Sitaram Yechury: అంత్యక్రియలు లేవు.. సీతారాం ఏచూరి పార్థివదేహాన్ని ఏం చేయనున్నారంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్లో రెండు రోజులు వైన్ షాప్లు బంద్.. వివరాలు ఇవే..
Telugu News, తెలుగు వార్తలు, Telugu Breaking News, Latest Telugu News మరిన్ని చూడండి
- తాజా సమాచారం
- మీడియా కవరేజి
- మన్ కీ బాత్’ (మనసు లో మాట)
- ప్రధానమంత్రి సందేశం
- పారదర్శకతే లక్ష్యం
- సమాచార హక్కు (ఆర్టిఐ)
- అధికారుల జాబితా (పిఎంఓ)
- ప్రధాన మంత్రి ఇంటర్ వ్యూలు
- ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి
- జాతీయ రక్షణ నిధి
- పిఎం కేర్స్ ఫండ్ గురించి
- అంతర్జాతీయ సందర్శనలు
- దేశీయ సందర్శనలు
- ప్రధాన మంత్రి ని గురించి తెలుసుకోండి
- మాజీ ప్రధానమంత్రులు
- ఒక సంవత్సరం
- రెండు సంవత్సరాలు
- మూడు సంవత్సరాలు
- నాలుగు సంవత్సరాలు
- దృశ్య మాలిక
- ప్రసంగాలు/ తాజా సంఘటనలు
- ప్రసంగ పాఠాలు
- ప్రధాన మంత్రి ఉపన్యాసాలు (వీడియోలు)
- ఇన్ఫోగ్రాఫిక్ లు & కోట్స్
- స్టాల్వార్ట్స్ (దిగ్గజాలు )
- సామాజిక మాధ్యమాల సమాచారం
- గౌరవనీయులైన ప్రధానమంత్రితో సంభాషించండి
- ఈ-పుస్తకాలు
- కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు
- పిఎమ్ఒ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగలరు
శ్రీమతి ఇందిరాగాంధీ
అత్యంత ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో 1917 నవంబర్ 19న జన్మించిన శ్రీమతి ఇందిరాగాంధీ స్వతంత్య్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుమార్తె. ఇకోలే నౌవెల్, బెక్స్ (స్విట్జర్లాండ్) ఇకోలే ఇంటర్నేషనల్ – జెనీవా, ప్యూపుల్స్ ఓన్ స్కూల్ – పూనె, బొంబే, బాడ్మింటన్ స్కూల్ – బ్రిస్టల్, విశ్వభారతి, శాంతినికేతన్, సోమర్ విల్ కాలేజ్ – ఆక్స్ ఫర్డ్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఆమె చదువుకున్నారు. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు పొందారు. ప్రముఖ విద్యా సంస్థల నుంచి విద్యను అభ్యసించిన నేపథ్యం కలిగిన ఇందిరాగాంధీ కొలంబియా యూనివర్శిటీ నుంచి విశిష్ట ప్రశంసా పత్రం అందుకున్నారు. సాతంత్య్ర పోరాటంలో ఇందిరాగాంధీ చురుకుగా పాల్గొన్నారు. బాల్యంలో ఆమె ‘బాల్ చరఖా సంఘ్’ స్థాపించారు. 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి సహాయంగా ఉండేందుకు పిల్లలతో కలసి ‘వానర్ సేన’ ఏర్పాటుచేశారు. 1942 సెప్టెంబర్లో జైలుకు వెళ్ళారు. 1947లో ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.
ఇందిరాగాంధీ 1942 మార్చి 26న ఫిరోజ్గాంధీని వివాహమాడారు. ఆమెకు ఇద్దరు కుమారులు. 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ ఎన్నికల కమిటీలలో సభ్యురాలిగా నియమితులయ్యారు. 1958లో కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఏఐసిసి జాతీయ సమగ్రతా మండలి ఛైర్ పర్సన్గాను, 1956లో అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గాను పనిచేశారు. 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి 1960 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1978లో మళ్ళీ అదే పదవిని చేపట్టారు.
1964 నుంచి 1966 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు భారత అత్యున్నత ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. ఇదే కాలంలో 1967 సెప్టెంబర్ నుంచి 1977 మార్చి వరకు అణు ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు. 1967 సెప్టెంబర్ 5 నుంచి 1969 ఫిబ్రవరి 14 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 1970 జూన్ నుంచి 1973 నవంబర్ వరకు హోం మంత్రిత్వశాఖకు నాయకత్వం వహించారు. 1972 జూన్ నుంచి 1977 మార్చి వరకు అంతరిక్ష వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1980 జనవరి నుంచి ప్రణాళికా సంఘం ఛైర్ పర్సన్గా వ్యవహరించారు. 1980 జనవరి 14న మళ్ళీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
పెద్ద సంఖ్య సంఘాలు, సంస్థలతో శ్రీమతి ఇందిరాగాంధీకి సంబంధం ఉంది. కమలా నెహ్రూ మెమోరియల్ హాస్పిటల్, గాంధీ స్మారక నిధి, కస్తూర్బా గాంధీ మెమోరియల్ ట్రస్టుతో ఆమెకు సంబంధం ఉంది. స్వరాజ్ భవన్ ట్రస్టుకు ఛైర్ పర్సన్గా పనిచేశారు. 1950లో బాల్ సహయోగ్, బాల్ భవన్ బోర్డు, చిల్డ్రన్స్ నేషనల్ మ్యూజియం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అల్హాబాద్ కమలా నెహ్రూ విద్యాలయాన్ని ప్రారంభించారు. 1966-77 మధ్య జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, నార్త్ ఇస్ట్రన్ వంటి కొన్ని పెద్ద సంస్థలతో కలిసి పనిచేశారు. ఢిల్లీ యూనివర్శిటీ కోర్టు సభ్యురాలిగాను, యునెస్కోకు (1960-64) భారత ప్రతినిధివర్గం సభ్యురాలిగాను, 1960-64లో యునెస్కో కార్యవర్గ మండలి సభ్యురాలిగాను, 1962లో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ సభ్యురాలిగాను వ్యవహరించారు. సంగీత, నాటక అకాడమీ, జాతీయ సమగ్రతా మండలి, హిమాలయ పర్వతారోహణ సంస్థ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ – జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ తో కూడా ఆమెకు సంబంధముంది.
1964 ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన శ్రీమతి ఇందిరాగాంధీ 1967 ఫిబ్రవరి వరకు పనిచేశారు. నాలుగు, ఐదు, ఆరు లోక్సభలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఏడవ 1980లో లోక్ సభకు ఆమె రాయ్ బరేలీ (ఉత్తరప్రదేశ్), మెదక్ (ఆంధ్రప్రదేశ్) నుంచి ఎన్నికయ్యారు. తరువాత మెదక్ స్థానాన్ని ఉంచుకుని రాయ్ బరేలీ స్థానాన్ని వదులుకున్నారు. 1967-77లోను తిరిగి 1980లోను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు.
విభిన్నమైన విస్తృతాంశాల పట్ల ఆసక్తి కలిగిన ఇందిరాగాంధీ జీవితం పట్ల సమగ్ర దృక్పథం కలిగి ఉండేవారు. కార్యకలాపాలు, వివిధ రకాల ఆసక్తులను వేరువేరుగా కాక మొత్తంగా రంగరించి ఆచరించడంలో తనదైన ప్రత్యేకతను ఇందిరాగాంధీ చాటుకున్నారు.
శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నో విజయాలు అందుకున్నారు. 1972లో భారత రత్న పురస్కారాన్ని స్వీకరించారు. మెక్సికన్ అకాడమీ అవార్డు ఫర్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (1972), ఎఫ్ఏఓ రెండవ వార్షిక మెడల్ 1973, నగరి ప్రచారిణీ సభకు చెందిన సాహిత్య వాచస్పతి (హిందీ) అవార్డు (1976) అందుకున్నారు. 1953లో అమెరికాకు చెందిన మదర్స్ అవార్డును స్వీకరించారు. దౌత్యవేత్తగా అందించిన సేవలకు గాను ‘ఇసిబెల్లా డి ఎస్టే అవార్డు ఆఫ్ ఇటలీ’ని, ఏల్ యూనివర్శిటీకి చెందిన హాలెండ్ మెమోరియల్ ప్రైజ్ను అందుకున్నారు. 1967, 1968 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో అత్యంత అభిమాన మహిళగా అవార్డు అందుకున్నారు. 1971 అమెరికాలోని ప్రత్యేక గ్యాలప్ పోల్ సర్వేలో ప్రపంచ అత్యంత అభిమాన నేతగా గౌరవం అందుకున్నారు. జంతు సంరక్షణకు చేసిన కృషికిగాను 1971లో అర్జెంటీనా సొసైటీ ఆమెకు గౌరవ డిప్లొమా ప్రదానం చేసింది.
ఇందిరాగాంధీ ప్రముఖ రచనల్లో ‘ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్’ (1966 – 69) , ‘ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్’ (1969 – 72), ‘ఇండియా’ (లండన్) (1975), ఇండే లాసన్నే(1979) మొదలైనవి ఉన్నాయి. ఇంకా అసంఖ్యాకమైన సంకలనాలు, ప్రసంగాలు, రచనలు వెలువరించారు. భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా, చైనా, నేపాల్, శ్రీలంక దేశాలను సందర్శించారు. ఫ్రాన్స్, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, గుయాన్, హంగేరీ, ఇరాన్, ఇరాక్, ఇటలీ వంటి దేశాల్లో అధికార పర్యటనలు జరిపారు. అల్జీరియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, బల్గేరియా, కెనడా, చిలీ, చెకొస్లవాకియా, బొలివియా, ఈజిప్ట్ దేశాలను కూడా సందర్శించారు. ఇండోనేషియా, జపాన్, జమైకా, కెన్యా, మలేషియా, మారిషస్, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నైజీరియా, ఒమన్, పోలెండ్, రుమేనియా, సింగపూర్, స్విట్జర్లాండ్, సిరియా, స్వీడన్, టాంజేనియా, థాయ్లాండ్ ట్రినిడాడ్-టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, అమెరికా, రష్యా, ఉరుగ్వే, వెనెజులా, యుగొస్లావియా, జాంబియా, జింబాబ్వే మొదలైన అనేక యురోపియన్, అమెరికన్, ఆసియన్ దేశాల్లో కూడా ఇందిరాగాంధీ పర్యటించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు.
ప్రధాన మంత్రిని గురించి తెలుసుకోండి
విశిష్టమైన లక్షణాలు, అంకితభావం, దృఢ సంకల్పం కలిగిన నరేంద్రమోడీ కోట్లాది మంది భారతీయుల జీవితాల్లోకి ఆశా కిరణంగా వచ్చారు.
Indira Gandhi Biography In Telugu
ఇందిరాగాంధీ బయోగ్రఫీ (నవంబర్ 19, 1917- అక్టోబర్ 30, 1984)
భారత తొలి మహిళా ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఇందిరాగాంధీ. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాలాల్ నెహ్రూ కుమార్తె. అసాధారణ ధైర్యసాహసాలను, అకుంఠితమైన కార్యదీక్షను, అసమానమైన పాలన ప్రదర్శించి దేశ విదేశాలలో ఖ్యాతి పొందిన మహిళ ఇందిరాగాంధీ. ఈమె పుట్టిన రోజున మహిళా దినోత్సవంగా దేశమంతా పాటిస్తున్నారు అంటే, ఆమె సాధించిన విజయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తన తండ్రి నెహ్రూ నుండి రాజకీయ మెలకువలు నేర్చుకొని తాను స్వయంగా ప్రధానిగా దేశానికి అపూర్వ సేవలను అందించి, తన కొడుకు రాజీవ్ గాంధీని కూడా దేశ ప్రధానిగా పనిచేయడానికి ఉత్తమ శిక్షణు అందించిన అద్భుతమహిళ శ్రీమతి ఇందిరాగాంధీ. దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా సమర్థవంతంగా పాలనను అందించారు. Indira Gandhi Biography In Telugu
Indira Gandhi బాల్యం
ఇందిరా ప్రియదర్శిని 1917 నవంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ కమల నెహ్రూ లకు ఏకైక సంతానం, ఈమె అలహాబాద్ లోని ఆనంద్ భవన్లో జన్మించారు. తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ జగమెరిగిన బ్రాహ్మణుడు, తల్లి కమలా నెహ్రూ మహా భక్తురాలు. ఇందిరాగాంధీకీ బాల్యం నుండి హిందూమత ఔన్నత్యం గురించి, సద్గురువులు, సంస్కృతికి సంబంధించిన ఎన్నో కథలు చెప్పేది. తాతగారైన మోతిలాల్ నెహ్రూ కి ఇందిరా పంచప్రాణాలు, మేనత్త విజయలక్ష్మి పండిట్, కృష్ణ లకు కూడా ఇందిరమ్మ అంటే ప్రాణం. బాల్యం నుండి ఇందిరా కు ధైర్య సాహసాలు ఎక్కువ, తండ్రి తాతల నుండి నేర్చుకున్న ఆత్మవిశ్వాసం పాఠశాలలో ప్రథమరాలిగా నిలబెట్టింది.
చిన్నతనంలో తండ్రితో పాటు సబర్మతి ఆశ్రమానికి వెళ్ళేది, అక్కడ గాంధీ మహాత్ముని బోధనలను వినేది, ఆ మహాత్ముని బోధనలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. అలానే రవీంద్రుని రచనలు ఆమెను ఎంతగానో ఆలోచింపజేశాయి, బ్రిటిష్ వారి చేతిలో భారతీయులు బానిసలుగా బ్రతకడం ఆమెకు ఇష్టం లేకపోయింది. తన పాణాలు పనంగా పెట్టినా సరే దేశానికి స్వాతంతం సాధించి తీరాలనే నిర్ణయం తీసుకుంది.
ఇకోలె ఇంటర్నేషనల్ – జెనీవా, ప్యూపుల్స్ ఓన్ స్కూల్- పూణే, బాంబే, బ్యాట్మెంటన్ స్కూల్- బ్రిస్టల్, విశ్వభారతి, శాంతినికేతన్, సోమర్ విల్ కాలేజ్- ఆక్స్ఫఫర్డ్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఇందిరాగాంధీ చదువుకున్నారు. అనేక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ డిగ్రీలు పొందారు. ప్రముఖ విద్యాసంస్థల నుంచి విద్యను అభ్యసించిన ఇందిరాగాంధీ కొలంబియా యూనివర్సిటీ నుంచి విశిష్ట ప్రశంస పత్రం అందుకున్నారు. బాల్యంలో ఆమె ‘బాల్ చరఖా సంఘ్’ స్థాపించారు.
1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కి సహాయంగా ఉండేందుకు పిల్లలతో కలిసి ‘వానర్ సేన’ ఏర్పాటు చేశారు. 1942లో సెప్టెంబర్ నెలలో ఆమె జైలుకు వెళ్లారు. ఆమె చదువుతున్న రోజుల్లో జర్నలిస్ట్ అయిన ఫిరోజ్ గాంధీ తో పరిచయం ఏర్పడి 1942 మార్చి 26వ తేదీన ఫిరోజ్ గాంధీ ని వివాహమాడారు. 1947లో ఢిల్లీలో అల్లర్లకు గురైన ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.
రాజకీయ ప్రవేశం- ముఖ్య ఘట్టాలు
- 1930లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి సహాయకంగా ఉండేందుకు “వానర్ సేన” ఏర్పాటు చేశారు.
- 1950లో అల్ట్రాబాద్ కమల నెహ్రూ విద్యాలయాన్ని ప్రారంభించారు.
- 1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్టీ ఎన్నికల కమిటీలలో సభ్యురాలుగా నియమితులయ్యారు.
- 1956లో అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
- 1958లో కాంగ్రెస్ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యురాలుగా నియమితులయ్యారు
- 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి 1966 వరకు ఆ పదవిలో కొనసాగారు.
- 1960 లో ఢిల్లీ యూనివర్సిటీ కోర్టు సభ్యురాలు గాన, యునెస్కో’కు భారత ప్రతినిధివర్గం సభ్యురాలు గాను, 1960-64 యునెస్కో కార్యవర్గ మండలి సభ్యురాలు గాను వ్యవహరించారు.
- 1962లో నేషనల్ డిఫెన్స్ కాలేజీ సభ్యురాలి గాను వ్యవహరించారు.
- 1964 ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన శ్రీమతి ఇందిరాగాంధీ 1967 ఫిబ్రవరి వరకు పనిచేశారు.
- 1964 నుండి 1966 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు.
- 1966-77 మధ్య జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, నార్త్ ఇన్స్టాన్ వంటి కొన్ని పెద్ద సంస్థలతో కలిసి పని చేశారు.
- 1966 జనవరి నుండి 1977 మార్చి వరకు భారత అత్యున్నత ప్రధానమంత్రి పదవిని అలంకరించారు.
- అదే కాలంలో 1967 సెప్టెంబర్ నుంచి 977 మార్చి వరకు అణు ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు.
- 1967 సెప్టెంబర్ ఐదు నుంచి 1969 ఫిబ్రవరి 14 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.
- 1970 జూన్ నుంచి 1973 నవంబర్ వరకు హోమ్ మంత్రిత్వ శాఖకు న్యాయకత్వం వహించారు.
- 1972 జూన్ నుంచి 1977 మార్చి వరకు అంతరిక వ్వవహారాల మంత్రిగా పనిచేశారు.
- 1980లో లోక్ సభకు ఆమె రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్, మెదక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో మెదక్ స్థానాన్ని స్వీకరించి రాయ్ బరేలి స్థానాన్ని వదులుకున్నారు.
- 1984 కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యారు.
- 1980 జనవరి నుంచి ప్రణాళికా సంఘం చైర్ పర్సన్ గా వ్యవహరించారు.
- 1980లో జనవరి 14న మళ్లీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
- ఇందిరాగాంధీ ప్రముఖ రచనల్లోనూ ప్రసంగాలు లోను భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని విస్తృతంగా పర్యటించారు.
- పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా, చైనా, నేపాల్, శ్రీలంక దేశాలను సందర్శించారు.
- ఫ్రాన్స్, జర్మనీ, గుయాన్, హంగేరి, ఇరాన్, ఇరాక్, అల్జీరియా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, బల్గేరియా, కెనడా, చెలి, చెకోస్లోవేకియా, ఇండోనేషియా, బొలీవియా, ఈజిప్ట్, జపాన్, జమైకా, కెన్యా, మలేషియా, మారిషన్, నెదర్లాండ్, మెక్సికో, నైజీరియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఒమన్, రుమేనియా, పోలాండ్, సిరియా, స్వీడన్, థాయిలాండ్, బ్రిటన్, అమెరికా, రష్యా, జాంబియా, జింబాబ్వే, యుగోస్లావియా, వెనిజులా, ఉరుగ్వే, అమెరికన్, ఆసియా దేశాల్లో ఇందిరాగాంధీ పర్యటించారు.
- విభిన్నమైన విస్తృత అంశాల పట్ల ఆసక్తి కలిగిన ఇందిరాగాంధీ జీవితం పట్ల సమగ్ర దృక్పథం కలిగి ఉండేవారు.
- వివిధ రకాల కార్యకలాపాలు ఆసక్తులను వేరువేరుగా కాక మొత్తంగా అంగరించి ఆచరించడంలో తనదైన ప్రత్యేకతను ఇందిరాగాంధీ చాటుకున్నారు.
దేశమంతా పర్యటించి 300 సభలను నిర్వహించి కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకొని వారందరి దృష్టిలో ఆమె వారి కోసం పోరాడే ఒక గొప్ప యోధురాలిగా కనిపించింది. ప్రజలే ఆమె బలం, వారిచ్చే తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని తెలిసిన ప్రత్యక్షంగా వారిని కలిసి గెలిపించ వలసిందిగా కోరింది. ఎలా అయినా ఇందిరాగాంధీని పదవీచ్యుతురాలిని చెయ్యాలని ‘ఇందిరాహఠావో’ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. ఆ నినాదానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ “గరీబీహటావో” [పేదరికాన్నిపారద్రోలండి) అనే నినాదంతో తన ప్రచారాన్ని నిర్వహించింది.
1942లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ ఆ ఉద్యమంలో అరెస్టు అయ్యారు. అరెస్టుకు నీరసంగా దేశమంతా సమ్మెలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ కూడా కారాగారానికి వెళ్లారు. కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడే రాజీవ్ గాంధీ. 1943 మే 13న విడుదల అయింది, దేశం కోసం పని చేయాలనే తపన ఆమెలో మొదలైంది.
రాజీవ్ గాంధీ కి రెండు సంవత్సరాలు వయసు ఉండగా వారు లక్నో బయలుదేరి వెళ్లారు అక్కడ నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకుడిగా ఫిరోజ్ గాంధీ పని చేసేవాడు, అక్కడే రాజీవ్ గాంధీ కి తమ్ముడు సంజీవ సంజయ్ గాంధీ జన్మించాడు. భర్తతో విభేదాలు కారణంగా అలహాబాద్ ను వదిలి ఢిల్లీ లోని తండ్రి దగ్గరికి చేరింది ఇందిర గాంధీ. 1954లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో జవహర్లాల్ నెహ్రూ కు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్ బరేలి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఇందిరాగాంధీ తండ్రి తరపున ప్రచారం చేసి గెలిపించింది. ఫిరోజ్ గాంధీ నెహ్రూ కు వ్యతిరేకంగా గళమెత్తి అవినీతి అక్రమాలను ముఖ్యంగా ‘భీమ కుంభకోణాన్ని’ బయటపెట్టాడు. జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధాని పదవిని అధిష్టించాడు.
ఇందిరా గాంధీని ప్రధానిగా ఉండమని లాల్ బహుదూర్ శాస్త్రి కోరాడు, ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహుదూర్ శాస్త్రి మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. ఆమె మాత్రం విజయం సాధించింది. దీనికి అసలు కారణం ఆమె సామాన్యునికి దగ్గరగా ఉండడం. ఇందిరాగాంధీ దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా సమర్థవంతంగా బాధ్యతలు స్వీకరించారు. దేశానికి తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరా మహిళా లోకానికి గర్వకారణంగా నిలిచారు.
అత్యవసర పరిస్థితి (Emergency)
1971లో అమేథీ లోక్సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్పై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు ఉన్నత న్యాయస్థానం 1975లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ అత్యున్నత న్యాయస్థానంలో స్టే ఆర్డర్ తెచ్చుకున్నది.
ప్రతిపక్ష నాయకులు, ఆమె వ్యతిరేకులు కలిసి ఇందిరకు వ్యతిరేకంగా ఒక పెద్ద ర్యాలీని నిర్వహించి, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఇందిరకు తమ అవిధేయతను తెలియజేయాల్సిందిగా కోరదలిచారు. ఈ సంగతిని పసిగట్టిన ఇందిర పరిస్థితిని చేజారనీయకుండా అదుపులోకి తీసుకురావాలని ఆలోచిందింది. వారిని అలా వదిలేస్తే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయని, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ ఇందిర దేశామంతటా అత్యయిక స్థితి (emergency)ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న అత్యయిక స్థితిని ప్రకటించారు.
20 సూత్రాల పథకం
పంచ వర్ష ప్రణాళికల నెరవేరడం లేదని తలచి గాంధీ గారి సూత్రాన్ని అనుసరించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వారి కోసం ఇరవై సూత్రాల పథకాన్ని రూపొందించింది. వెట్టి చాకిరీ చట్ట విరుద్ధమని ప్రకటించింది. 20 సూత్రాల పథకం ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానని ఆమె చేసిన ప్రతిజ్ఞను చెల్లించుకోవడమే ఆమె ఆశయం. ఇరవై సుత్రాల పథకాన్ని అమలు చెయ్యాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్రమంత్రులకు సూచించింది. దేశ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడసాగింది.
ఇందిరాగాంధీ పాలనాపరంగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 14 బ్యాంకులను జాతీయం చేయడం., సంస్థానాధీశులకు ఇచ్చే భరనాలను రద్దు చేయడం, అణుపరీక్షలకు అనుమతిని ఇవ్వడం, బంగ్లాదేశ్ అవతరణకు సైన్య సహకారాలను అందించడం వంటి సంచలనాత్మక, సాహస పూరిత నిర్ణయాలు ఆమె వ్యక్తిత్వానికి అడ్డు పడ్డాయి. పంజాబ్ లో సంభవించిన హింసను అణచివేయడానికి చేపట్టిన ఆపరేషన్ “బ్లూస్టార్” సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది. సిక్కుల పవిత్ర దేవాలయం అయిన స్వర్ణ దేవాలయంలో కాల్పులు జరగడం వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.
Indira Gandhi మరణం
ఇందిరాగాంధీ 1984 అక్టోబర్ 30వ తేదీన ఇంటి నుండి ఆఫీస్ కి వెళ్తుండగా ఆమె రక్షకుడు బియాంత్ సింగ్ అనే సిక్కు ఆమెపై దారుణంగా కాల్పులు జరిపాడు. దాంతో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.. ఆమె మరణం జాతికి తీరని లోటు…
శ్రీమతి ఇందిరా గాంధీ ఎన్నో విజయాలను అందుకున్నారు.
- 1971లో “భారతరత్న” పురస్కారాన్ని స్వీకరించి, ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది.
- 1953లో అమెరికాకు చెందిన మదర్స్ అవార్డును స్వీకరించారు.
- 1967 – 68 సంవత్సరాలలో వరుసగా రెండుసార్లు ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ సి రా ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ సర్వేలో అత్యంత అభిమాన మహిళగా అవార్డును అందుకున్నారు.
- 1971లో జంతు సంరక్షణకు చేసిన కృషికి గాను అర్జెంటీనా సొసైటీ ఆమెకు డిప్లొమా ప్రధానం చేసింది.
- 1971లో అమెరికాలోని ప్రత్యేక గ్యాలప్ పోల్ సర్వేలో అత్యంత అభిమాన నేతగా గౌరవం అందుకున్నారు.
- 1972లో మెక్సికన్ అకాడమీ అవార్డు ఫర్ లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ పురస్కారాన్ని అందుకున్నారు.
- 1973లో ఎస్ఏఓ రెండవ వార్షిక మెడల్ అందుకున్నారు.
- 1976లో నగరి ప్రచారిణి సభకు చెందిన సాహిత్య వాచస్పతి అవార్డును అందుకున్నారు.
ఇందిరా ప్రధానిగా దేశానికి అందించిన సేవలు ఈనాటికీ మరువలేనివి. పేదరికాన్ని పారద్రోలే గరీబీ హటావో అనే నినాదానికి వాస్తవ రూపం ఇచ్చి నిరుపేదల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. విదేశాలతో మన సంబంధం బాంధవ్యాలను పెంచి, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇందిరమ్మ పేరు భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం ఉండి తీరుతుంది.
Read also…
Mother Theresah Biography in Telugu
CLICK HERE
- APPSC Departmental tests May 2024 session results
- Open schools SSC Intermediate Admission Notification 2024
- NMMS Mathematics Number system quiz
- Class 9 English The Fun They Had-Isaac Asimov quiz
- Class 1-10 Mathematics key
- Vinayaka Chavithi Vratha kadha in Telugu
IMAGES
VIDEO
COMMENTS
ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 ...
ఇందిరా గాంధీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర) దేశాన్ని నడిపించిన చరిష్మా గల, వివాదస్పద రాజకీయ నాయకులలో ఇందిరా గాంధీ అగ్రగణ్యులు. 1966-1977 వరకు మళ్ళీ 1980 లో నుంచి 1984 లో ఆమె కన్నుమూసేంత వరకు దేశ...
ఇందిరా గాంధీ బయోగ్రఫీ | Indira Gandhi Biography | Indira Gandhi RealStoryIndira Gandhi Biography part-2:-Indira Gandhi BiographyHii FRIENDS For: ADVERTISEMEN...
Indira Gandhi. Photo : Twitter. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ప్రస్తావిస్తే ఎన్నో విషయాలు గుర్తుకువస్తాయి. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన ఇందిరా గాంధీ.. తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భారత మొదటి మహిళా ప్రధానమంత్రిగా నిలిచారు.
జనవరి 14, 1980 – అక్టోబర్ 31, 1984 | కాంగ్రెస్ (ఐ) అత్యంత ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో 1917 నవంబర్ 19న జన్మించిన శ్రీమతి ఇందిరాగాంధీ స్వతంత్య్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ కుమార్తె.
Indira Gandhi's blood-stained saree and her belongings at the time of her assassination, preserved at the Indira Gandhi Memorial Museum in New Delhi. ఆమె కాల్పుల అనంతరం 09:30 కు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ...
ఇందిరాగాంధీ || జీవితచరిత్ర || 25 ముఖ్యమైన జనరల్ నాలెడ్జి పాయింట్లు
Indira Gandhi Biography In Telugu. ఇందిరాగాంధీ బయోగ్రఫీ (నవంబర్ 19, 1917- అక్టోబర్ 30, 1984) భారత తొలి మహిళా ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తి ఇందిరాగాంధీ. అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాలాల్ నెహ్రూ కుమార్తె.
About Press Copyright Contact us Creators Advertise Developers Terms Privacy Policy & Safety How YouTube works Test new features NFL Sunday Ticket Press Copyright ...
Indira Priyadarshini Gandhi (Hindi: [ˈɪndɪɾɑː ˈɡɑːndʱi] ⓘ; née Indira Nehru; 19 November 1917 – 31 October 1984) was an Indian politician and stateswoman who served as the 3rd prime minister of India from 1966 to 1977 and again from 1980 until her assassination in 1984.